నాలుగు రోజులు ధరణి వెబ్ సైట్ బంద్

  • డేటా బేస్ వర్షన్ అప్ డేట్ నేపథ్యంలో..

సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న సేవలు

: డేటా బేస్ వర్షన్ అప్ గ్రేడ్

నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటిం చారు. గురువారం సాయంత్రం నుంచి అప్ గ్రెడేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. సోమవారం నుంచి సేవలు తిరిగి ప్రారంభమవు తాయని పేర్కొన్నారు. రాహాస మూడు రోజుల నుంచి ధరణి సేవల్లో అతరాయం ఉందని, బుధవారం నుంచి ఓటీపీలు రావడం లేదని మీ సేవా నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు రెండు రోజులు ధరణి ద్వారా ఓన్లీ సేల్ డీడ్ మాత్రమే అయ్యాయి. టీఎం-33, గిఫ్ట్ డీడ్స్ వంటి మాడ్యూల్స్ పని చేయలేదు. మధ్య మధ్యలో సైట్ లోడింగ్ అని చూపించింది. టెర్రాసిస్ సృష్టించిన సాఫ్ట్ వేర్, పోర్టల్ ను యథాతథంగా వాడడం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతున్నా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ సమస్య ఉన్నా ఒక్క మాడ్యూల్ కిందనే దరఖాస్తు చేసుకు నే వెసులుబాటును తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే టెర్రాసిస్ సాఫ్ట్ వేర్ తో అధి కారులు ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్ నిర్వహణను చేపట్టిన ఎన్ఐసీకి ఇది తలనొప్పిగా మారినట్లు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *