• రెండో రోజూ జనాదరణ కరువు
మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్
సెంటర్లో కొనసాగుతున్న నేషనల్ రియలేస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) 14వ ఎడిషన్ ప్రాపర్టీ షో రెండో రోజు కూడా వెలవెలబోయింది. మొదటి రోజు పెద్దగా స్పందన లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఎగ్జిబిటర్లు రెండో రోజు ఫ్యామిలీతో కలిసి జనాలు ప్రాపర్టీ షోకు వస్తారని, మంచి ఊపు ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు. అయినా.. మొదటి రోజు లాగే రెండో రోజు కూడా వారికి నిరుత్సాహం తప్పలేదు. అడపాద డపా వచ్చిన జనాలు కూడా ప్రాపర్టీల గురించి తెలుసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆయా రియలేస్టేట్ కంపెనీలు లక్షల రూపాయలు చెల్లించి స్టాల్స్ ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో సేల్స్ ప్రమోటర్లను పెట్టుకుని ఖాళీగా కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనాలు లేక చాలా స్టాల్స్ ఖాళీగా కనిపించాయి. స్టాళ్లు
కొంతమంది కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ప్రాపర్టీలు ఎలాగూ అమ్ముడుపోతాయనే అతి నమ్మకం, కొందరు నరెడ్కో ప్రతినిధుల ఏకఛత్రాధి పత్యంతో ప్రాపర్టీ షో అట్టర్ ఫ్లాఫ్ అయింది. కనీస ఆదరణ కూడా కరువైందని షోలో స్టాల్స్ ఏర్పాటు చేసిన పలువురు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. కోట్ల రూపాయలతో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు మీడియా పరంగానూ పెద్దగా ప్రచారం కల్పించలేదని, ప్రచారం లేకుండా షో కోసం ఎవరు వస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరాలలో ఒకటిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నగరంలో జరుగుతున్న అభివృ ద్ధిపై కొద్ది నెలలుగా కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర డిప్యూటీ సీఎం
మల్లుభట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైటెక్స్లో జరుగుతున్న నరెడ్కో 14వ ఎడిషన్ ప్రాపర్టీ షోలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అందుకోసం రూ.10వేల కోట్లను కేటాయించామని, ఇది కేవలం క్యాపిటల్ ఎక్స్పెండేచర్ మాత్రమేనని తెలిపారు. మూసీ నిర్వా సితులకు అద్భుతమైన భవిష్యత్తును అందించేం దుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని తెలిపారు. 30 వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, అక్కడ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.