నకిలీ పత్రాలతో స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

నకిలీ పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ కటకటాల పాలయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు చెప్పినట్లుగా నడుచుకున్నందుకు గానూ సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతి ఇప్పుడు జైలు పాలయ్యారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఇదే కేసులో బీఆర్ఎస్ నేత పద్మాజా రెడ్డి జైలు పాలయ్యారు. ఈ కేసును సమగ్రంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్స్ లో పద్మజారెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. గతంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన జ్యోతి… ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తో స్థలాన్ని పద్మజారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పద్మజారెడ్డితో పాటు సబ్ రిజిస్ట్రార్ జ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూకబ్జా కేసులో ఇటీవల పద్మజారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు రిమాండ్‌కు విధించారు. తాజాగా ఈ కేసులో…ప్రస్తుతం సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *